
530views
అయినవిల్లి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా నిర్వహించే సప్తనదీ జలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా సిద్ధివినాయక స్వామివారి చెంత ఉంచిన లక్ష పెన్నుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభించనున్నారు. నేటినుండి విద్యార్థులకు లక్ష పెన్నుల పంపిణీ చేయనున్నారు.





