News

భారత్-మధ్య ఆసియా దేశాల మధ్య తొలి సదస్సుకు మోడీ నేతృత్వం

633views
  • ప్రాంతీయ శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచన..

న్యూఢిల్లీ: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​-సెంట్రల్​ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్​గా నేతృత్వం వహించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచించారు.

భారత్​-సెంట్రల్​ ఆసియా సదస్సులో మూడు లక్ష్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారు. “ప్రాంతీయ భద్రత, శ్రేయస్సుకు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా కేంద్రంగా ఉంది.
రెండోది.. దేశాల మధ్య సహకారానికి సమర్థవంతమైన విధానం ఉండాలి. అది.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర చర్యల కోసం ఒక వేదిక ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది.

మూడోది.. దేశాల మధ్య సహకారానికి ప్రతిష్ఠాత్మకమైన రోడ్​మ్యాప్​ను సిద్ధం చేయటం. ఇది ప్రాంతీయ అనుసంధానత, సహకారం కోసం సమగ్ర విధానాన్ని అవలంబించడానికి వీలు కల్పిస్తుంది” అని మోడీ పేర్కొన్నారు.

వర్చువల్​గా జరిగిన ఈ సదస్సుకు కజకిస్థాన్​ అధ్యక్షుడు కస్యమ్​ జొమార్ట్​ టొకయెవ్​, ఉజ్బెకిస్థాన్​ అధ్యక్షుడు శవ్కాత్​ మిర్జియోయెవ్​, తజకిస్థాన్​ అధ్యక్షుడు ఎమొమాలి రహ్మోన్​, తుర్కెమిస్థాన్​ అధ్యక్షుడు గుర్బాంగులి బెర్డిముహామెడోవ్​, కిర్గిస్థాన్​ రిపబ్లిక్​ అధ్యక్షుడు సడైర్​ జపరోవ్​ హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి