368
న్యూఢిల్లీ: తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టారన్న ఆరోపణలపై శ్రీలంక నావికాదళం నిర్బంధించిన 56 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని అక్కడి కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న భారతీయ మత్స్యకారులందరూ విడుదల కానున్నారు. గతేడాది డిసెంబరులో మన్నార్కు దక్షిణాన సముద్రంలో శ్రీలంక నావికాదళం ఈ జాలర్లను పట్టుకుంది.
శ్రీలంకతో ఆర్థిక చర్చలు జరుగుతోన్న ప్రస్తుత తరుణంలో.. మానవతా దృక్పథంలో వారిని విడుదల చేయాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో మత్స్యకారుల విడుదలకు సంబంధించి తాజా ఆదేశాలు వచ్చాయి. కోర్టు ఆదేశాలు సంతోషకరమని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.