
న్యూఢిల్లీ: సుపంపన్నమైన హిందూ దేశంపై దాడి చేసి, సంపదను దోచుకుని, ఇక్కడి సంస్కృతి వినాశనానికి తీవ్రంగా ప్రయత్నించిన మొఘలులును నటుడు నసీరుద్దీన్ షా పొగిడాడు. నిన్న(డిసెంబర్ 29) ఒక ప్రచార వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా భారతదేశంలో మొఘల్లు శరణార్థులని, నేడు దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఉందని అన్నారు.
“మొఘలుల దురాగతాలు అని పిలవబడేవి ఎప్పటికప్పుడు హైలైట్ చేయబడుతున్నాయి… మొఘలులు దేశానికి దోహదపడిన వ్యక్తులని మనం మర్చిపోతున్నాము.. వారు దేశంలో శాశ్వత స్మారక చిహ్నాలను విడిచిపెట్టిన వ్యక్తులు, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం సంప్రదాయాన్ని విడిచిపెట్టారు. మొఘలులు ఇక్కడికి వచ్చి తమ మాతృభూమిగా మార్చుకున్నారు. మీకు నచ్చితే వారిని శరణార్థులు అని పిలవవచ్చు” అని షా అన్నారు.
షా వ్యాఖ్యలపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ మొఘలులు ఆక్రమణదారులని, వారి వల్ల భారతీయ నాగరికతకు పెను నష్టం వాటిల్లిందని ట్విటర్లో పేర్కొన్నారు. “మొఘలులు చాలా వరకు హిందూ నాగరికత, మతం, జనాభా, సంస్కృతి మొదలైనవాటిని నాశనం చేసిన అనాగరిక ఆక్రమణదారులు. పాక్, భారతదేశం ఎదుర్కొంటున్న అనేక ఇతర సమస్యల సృష్టికి వారే మూల కారణం. మీరు వారిని సెటిలర్లు లేదా శరణార్థులు అని పిలుస్తారా? సిగ్గుపడాలి #నసీరుద్దీన్షా”… అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ వ్యాఖ్యాత స్మితా దేశ్ముఖ్ మొఘల్లపై నసీరుద్దీన్ షాకు విచిత్రమైన వ్యామోహం ఉందన్నారు.
మైనారిటీల మనసుల్లో భయాందోళనలు సృష్టించేందుకు పాలక యంత్రాంగం వేరే వర్గాల మద్దతుతో దేశంలో ఉద్దేశపూర్వకంగా మసీదులు, చర్చిలను కూల్చివేశారని షా ఆరోపించారు. షాకు వివాదాలు కొత్త కాదు. వాస్తవానికి, గత కొన్నేళ్లుగా అతను మీడియాలో నిరాధారమైన ఆరోపణలు చేయడంపై దృష్టి పెట్టాడు. అంతేకాదు.. ఆయా సందర్భాల్లో ప్రముఖ నటులు రాజేష్ ఖన్నా, అనుపమ్ ఖేర్లను కూడా విమర్శించాడు.
ఈ ఏడాది ఆగస్టులో కాబూల్ను తాలిబాన్ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, నసీరుద్దీన్ షా భారతీయ ముస్లింలు తాలిబాన్కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. తాలిబాన్లను విమర్శించినందుకు ఇస్లాంవాదులు ఆయనను తీవ్రంగా విమర్శించారు.
Source: Organiser





