
353views
-
సైన్యం సాయం కోరిన అధికార యంత్రాంగం
జమ్మూ: జమ్ముకశ్మీర్లో విద్యుత్ సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. ఫలితంగా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. సుమారు 50 శాతానికి పైగా జమ్ము కశ్మీర్ అంధకారంలో ఉండిపోయింది. దీంతో అత్యవసర సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు స్థానిక అధికార యంత్రాంగం సైన్యం సాయం కోరింది. ఉద్యోగుల సమ్మె కారణంగా జమ్ము ప్రాంతంలో విద్యుత్ సేవలపై తీవ్ర ప్రభావం పడిందని, ఆర్మీలోని జమ్ము డివిజన్ కమిషనర్ రాఘవ్ లాంఘర్ తెలిపారు.
ఈ కారణంగా ప్రధాన విద్యుత్ స్టేషన్లలో, నీటి సరఫరాకు సరిపడా సిబ్బంది లేరు. దీంతో అవసరమైన సేవలను పునరుద్ధరించడానికి సైన్యం సాయం చేయాల్సిందిగా కోరుతున్నాని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్మీ అధికారులు నీటి సరఫరా, విద్యుత్ స్టేషన్లలో షిప్ట్ల ప్రకారం సేవలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు బలగాలు రంగంలోకి దిగినట్టు స్పష్టం చేశారు.





