261
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం నగడగ్ పెల్ గి ఖోర్లో లభించింది. ఈ మేరకు భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.‘‘భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పేరును ఎంపిక చేయడం విని నేను చాలా సంతోషించాను’’ అని భూటాన్ దేశ ప్రధాని ట్వీట్ చేశారు.
‘‘కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మోదీజీ అందించిన సహాయం, షరతులు లేని స్నేహం మరవలేనిది, భూటాన్ దేశ అత్యున్నత అవార్డుకు మోదీజీ అర్హులు, భూటాన్ ప్రజల నుంచి మోదీకి అభినందనలు. మోదీజీ గొప్ప మహనీయుడు, ఆధ్యాత్మిక మానవుడు. మోదీని వ్యక్తిగతంగా కలిసి వేడుక జరుపుకోవడానికి ఎదురు చూస్తున్నాను.’’ అని భూటాన్ ప్రధానమంత్రి లోటే షేరింగ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు.