
681views
న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్ ‘ఒమిక్రాన్’ దేశంలోకి ప్రవేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. కర్ణాటకలోనే ఈ రెండు కేసులు నమోదైనట్టు పేర్కొంది. 66, 46 ఏళ్లు ఉన్న పురుషుల్లో కొత్తరకం వైరస్ గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.
ఇదిలా ఉంటే ఒమిక్రాన్ గురించి ఆందోళన అవసరం లేదని పెర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వివరించారు. 24 గంటల క్రితం ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 37 ప్రయోగశాలలు ఏర్పాటు లవ్ అగర్వాల్ వెల్లడించారు.
Source: EtvBharat





