News

విశాఖ తీరంలో టీటీడీ కార్తీక దీపోత్సవం

314views

విశాఖ‌ప‌ట్నం: విశాఖ తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సాగర తీరంలో కార్తిక దీపాలు వెలిగించారు. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీపూజ నిర్వహించారు. దీపోత్సవంలో టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరుపతి, బెంగళూరులో కార్యక్రమం తలపెట్టినా భారీ వర్షాలతో విశాఖకు మార్చారు. కృష్ణా జిల్లా నందిగామలో కోటి దీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆదిత్యానంద భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి