News

అసంఘటిత కార్మికుల కోసం పింఛన్ విరాళ పథకం

508views
  • ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలో పనిచేసిన వృద్ధ కార్మికుల కోసం ఆర్థిక స్థోమత ఉన్న సంఘటిత రంగం వారు నిర్ణీత మొత్తంలో పింఛను త్యాగం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేయనున్నారు. వంట గ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ ప్రధాని గతంలో ఇచ్చిన పిలుపు సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయనున్నట్టు తెలుస్తోంది.

పదవీ విరమణ చేసి గణనీయ మొత్తాల్లో పింఛన్లు పొందుతున్న వారు ఏటా కనీసం రూ.36 వేలను విరాళంగా అందించాలని మోదీ సర్కారు అభ్యర్థించనున్నది. ఈ మొత్తాన్ని అసంఘటిత రంగంలో 60 ఏళ్లు పైబడిన వారికి తలా రూ.3,000 చొప్పున పంపిణీ చేయదలిచారు. ఈ కొత్త ప్రతిపాదనకు ‘పింఛన్‌ విరాళం’ అని నామకరణం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి