
-
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
జెనీవా: కరోనా కట్టడికి ప్రపంచ దేశాల మధ్య ఓ సహకార ఒప్పందం అవసరమని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. భవిష్యత్లో సరికొత్త వేరియంట్లు ఉద్భవించినప్పటికీ ధాటిగా ఎదుర్కొనడానికి వీలవుతుందని పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాతో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అధనోమ్ పాల్గొన్నారు.
ప్రపంచ దేశాల మధ్య ఓ అవగాహన ఒప్పందం అవసరమని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ లక్షణాలు తీవ్రంగా లేవని దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్లు చెబుతున్నారు. గత 10 రోజుల్లోనే 81 శాతం కేసులు పెరిగాయని గాటెంగ్ ప్రావిన్సుకు చెందిన డాక్టర్ ఉబెన్ పిల్లై తెలిపారు. ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. టీకా వేసుకోనివారి కంటే వ్యాక్సిన్ వేసుకున్నవారిలో మరింత తక్కువ తీవ్రత కనిపిస్తోందని పేర్కొన్నారు.