
471views
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి అందించేందుకు ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లద్దాఖ్ మహిళ ఈ పథకం ద్వారా జీవితం ఎంత సాఫీగా మారిందో వివరించే వీడియోను మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్యాగ్ చేశారు. జల్జీవన్ మిషన్ అసలు లక్ష్యం ఇదే అని ప్రధాని వివరించారు.





