News

బహిరంగంగా నమాజ్ చేయొద్దంటున్నా వినని ముస్లింలు

679views

గురుగ్రామ్‌: గురుగ్రామ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తూనే వస్తున్నారు. ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రాంతాల్లో నమాజ్ చేయకూడదని నిరసన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ముస్లింలు నమాజ్ చేసుకోడానికి మారుతున్నారు తప్పితే.. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం మానడం లేదు.

గుర్గావ్ సెక్టార్ 37లో బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడం మొదలు పెట్టారు ముస్లింలు. దీన్ని మొదటి నుండి స్థానికులు అడ్డుకుంటూ ఉన్నారు. హిందూ సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. తమ ప్రాంతంలో నమాజ్ చేయకండి అని చెప్పుకొచ్చారు. అయినా వినిపించుకోకపోవడంతో ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఘటనా స్థలంలో పోలీసులను కూడా మోహరించారు.
రెండు వారాల క్రితం నగరంలోని సెక్టార్ 12A ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. హిందూ సంఘాలలు ముస్లింలను నమాజ్ చేయకుండా ఉండేందుకు, వాలీబాల్ కోర్టును తయారు చేశారు. నమాజ్ చేయడానికి వచ్చిన వ్యక్తులు స్థానికులతో గొడవ కూడా పడ్డారు. ఏది ఏమైనా మేము నమాజ్‌ని అనుమతించము అని స్థానికులు తేల్చి చెప్పారు.

2018లో ఇలాంటి ఘర్షణల తర్వాత హిందువులు, ముస్లింల మధ్య ఒప్పందం తర్వాత నమాజ్ కోసం 29 సైట్‌ లు కేటాయించారు (అధికారులు ఎనిమిది ప్రాంతాల్లో అనుమతిని ఉపసంహరించుకోవడానికి ముందు 37). అయితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో హిందువులు పబ్లిక్ ప్లేస్ లలో నమాజ్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సెక్టార్ 12A సైట్‌ విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి