News

విదేశాలకు కొవిడ్ టీకాల ఎగుమతికి వాణిజ్య అనుమతి

631views

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మద్దతుతో నేపాల్, తజికిస్థాన్​, బంగ్లాదేశ్, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల డోసుల కొవిషీల్డ్‌ను ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం వాణిజ్య అనుమతించింది. నేపాల్‌, తజికిస్థాన్‌లకు ఈ వారంలో కొవిషీల్డ్‌ డోసులు అందనున్నాయి. దేశంలో సరిపడా టీకా డోసులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశీయంగా టీకా లభ్యత ఆధారంగా నెలనెలా ఎన్ని డోసులు ఎగుమతి చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి