News

జనవరి నుంచి చిన్నారులకు కరోనా టీకాలు

512views

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు కరోనా టీకా పంపిణీ ప్రారంభించే అవకాశాలున్నట్టు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్యునైజేషన్ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తూ వారికి టీకాలు వేసే అవకాశమున్నట్టు తెలిపాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలకు టీకా పంపిణీపై కేంద్రం దృష్టిపెట్టింది. మరోవైపు జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకాను 12-18 ఏళ్ల వయసు వారికి కూడా ఇవ్వొచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఈ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులిచ్చినప్పటికీ ఇంకా పంపిణీ ప్రారంభించలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి