
-
రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఉత్తరాఖండ్: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే, ఎవరైనా భారత్నుంచి అంగుళం భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. పితోర్ఘర్ జిల్లాలోని జోల్ఖెట్ మూనాకోట్ నుండి ప్రారంభమైన ‘షహీద్ సమ్మాన్ యాత్ర’ రెండో దశను ప్రారంభించడానికి రాజ్నాథ్ సింగ్ శనివారం ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, భారతదేశం ఏ దేశంపైనా దాడి చేయలేదు, విదేశీ భూమిని ఆక్రమించలేదు. ఇది భారతదేశ సంస్కృతి. కానీ, కొంతమందికి అది అర్థం కాదు. అది వారి అలవాటా లేక స్వభావమో తెలియదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ పేరు చెప్పుకుని, ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని, దానికి బలమైన సందేశం పంపామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులు దాటితే సరిహద్దుల్లో ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా వారి భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్, వైమానిక దాడులు చేస్తామని పశ్చిమ సరిహద్దులోని పొరుగువాడికి స్పష్టమైన సందేశం ఇచ్చారు.
Source: Tv9





