News

ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదు

789views
  • ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్

రాయ్‌పూర్‌: దేశంలో ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. బలవంతపు మతమార్పిడిని వ్యతిరేకిస్తూ, హిందూ మతం నుంచి ఎవరినీ మార్చాల్సిన అవసరం లేదని, కలిసి ముందుకు సాగాలని పిలుపిచ్చారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చడానికి సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన ఉద్బోధించారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఘోష్ శివిర్‌ను ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ, భారతదేశ వైవిధ్యమే దాని బలం అని చెప్పారు. విశ్వ గురువుగా మారడానికి దాని జీవన విధానాన్ని ప్రపంచానికి అందించాలని సూచించారు. బలహీనులు తరచుగా దోపిడీకి గురవుతారని పేర్కొంటూ, దేశం స్వరానికి భంగం కలిగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, దేశం లయ ద్వారా స్థిరపడతారని ఆయన పేర్కొన్నారు.

‘మనం ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదు, జీవించడం ఎలాగో నేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠాలు చెప్పడానికే మనం భారత దేశంలో పుట్టాం. ఎవరి ఆరాధనా విధానాన్ని మార్చకుండా మా ఆర్ఎస్ఎస్ మంచి మనుషులను తయారు చేస్తుంది’ అని ఆయన గుర్తు చేశారు.

‘మన సమాజంలో వైవిధ్యం ఉంది.. ఎందరో దేవుళ్లు ఉన్నారు.. పర్వాలేదు.. అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి.. శతాబ్దాలుగా కొనసాగుతున్నదానిని మనం ఎవరినీ మార్చాల్సిన అవసరం లేదు.. అనుమతించబోం. మన ప్రజలు మారతారు’ అని సూచించారు. ‘ఎవరినీ మతం మార్చడానికి ప్రయత్నించకుండా హిందూ మతం బోధనలను ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉంది’ అని ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పారు. ఈ రోజు ప్రజలు హిందూ మతం అని పిలుస్తున్న మన మతాన్ని మార్చడానికి ప్రయత్నించకుండా ప్రపంచానికి అందించాలి’ అని స్పష్టం చేశారు.

డాక్ట‌ర్‌ భగవత్ హాజరైన ‘ఘోష్ ప్రదర్శన్ లో ఒక నిర్దిష్ట లయలో ఏడు రకాల సంగీత వాయిద్యాలను ప్రదర్శించారు. రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌ విభాగాలకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకులు నెల రోజులుగా నిరంతరంగా అభ్యాసం చేసిన్నట్టు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత్‌ ప్రచార్‌ ప్రముఖ్‌ కనిరామ్‌ తెలిపారు. శివనాథ్ నదిపై ఉన్న మడ్కు ద్వీపంపై ఉత్సవ దీపాన్ని వెలిగించడంతో కార్యక్రమం ముగిసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి