News

నమాజ్‌ కోసం ఆటగాళ్ళను కొట్టారు…

1.4kviews
  • బహిరంగ ప్రదేశం ఆక్రమణ

  • వచ్చే వారం ఊరుకునేది లేదని యువకుల హెచ్చరిక

  • గురుగ్రామ్‌లో ఘటన

గురుగ్రామ్‌: హర్యానాలోని గురుగ్రామ్‌లో నమాజ్‌కు చోటు ఇవ్వమని కొంతమంది ముస్లింలు మైదానంలో క్రికెట్‌ ఆడుకుంటున్న ఆటగాళ్ళను బెదిరించి, కొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలివి. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పాకుతోంది. ఈ నెల 19న శుక్రవారం నమాజ్‌ చేయడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు బహిరంగ మైదానంలోకి వెళ్ళిన తర్వాత సెక్టార్‌ 37లో స్థానిక నివాసితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మైదానం ఖాన్‌స్దా గ్రామంలో ఉంది. స్థానిక యువకులు క్రికెట్‌ ఆడటంతో పాటు వాహనాలను పార్క్‌ చేస్తారు. గత శుక్రవారం మైదానంలో క్రికెట్‌ ఆడుతున్న గ్రామంలోని వారితో ముస్లింలు అసభ్యంగా ప్రవర్తించారని ఖాన్‌స్దా నివాసితులు ఆరోపించారు. తమ గ్రామంలోని మైదానంలో ఎటువంటి అక్రమ ఆక్రమణలను అనుమతించమని తెలిపారు.

ముస్లింలు నమాజ్‌ చేయడానికి రావడంతో క్రికెట్‌ ఆడుతున్న యువకులు తమ గ్రామం మైదానాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరించారు. వద్దంటున్నా నమాజ్‌ చేయడానికి బహిరంగ స్థలాలను ఆక్రమించారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్టార్‌ 10, సెక్టార్‌ 37లలో పోలీసులు చేరుకుని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. వచ్చే శుక్రవారం నుంచి తమ మైదానాన్ని నమాజ్‌ కోసం వినియోగించేందుకు అనుమతించబోమని యువకులు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

స్థానిక న్యూస్‌ ఛానెల్‌ గురుగ్రామ్‌ న్యూస్‌తో కొంతమంది యువకులు మాట్లాడారు. ‘ప్రతి సెలవుదినం మేము క్రికెట్‌ ఆడటానికి ఈ మైదానానికి వస్తాము. ఉదయం నుంచి క్రికెట్‌ ఆడుతున్నాం. వారు(ముస్లింలు) మధ్యాహ్నం 12 గంటలకు మైదానానికి చేరుకోవడం ప్రారంభించారు. ఒక గంటలోపు సుమారు వెయ్యి మంది ముస్లింలు ఇక్కడ సమావేశమయ్యారు. వారు నమాజ్‌ చేయడానికి మసీదులు, గదులు, ఇతర ప్రదేశాలను కలిగి ఉన్నారు. కానీ, మాకు మాత్రం ఇదొక్కటే మైదానం. మసీదులు, గదుల వద్ద నమాజ్‌ చేయమని మేము వారిని కోరుతున్నాము’ అని స్థానికులు అన్నారు.

నమాజ్‌ కోసం ముస్లింలను ఇతర ప్రాంతాలకు వెళ్లమని పోలీసులు అడగకుండా గ్రామస్థులను మైదానాన్ని ఖాళీ చేయమని ఒప్పించారని.. వచ్చే శుక్రవారం నుండి ఇలాంటివి కుదరవని తెలిపారు. మరికొందరు స్థానికులు మాట్లాడుతూ… శుక్రవారం ఇక్కడ క్రికెట్‌ ఆడుతున్న అబ్బాయిలను ముస్లింలు కొట్టి, బెదిరించారని స్థానికులు ఆరోపించారు. అబ్బాయిలపై దురుసుగా ప్రవర్తించారని, తమను అడ్డుకున్నారని తమకు కోపం వచ్చిందని ఖాన్‌స్దా గ్రామానికి చెందిన సుందర్‌ చౌహాన్‌ తెలిపారు. ‘ఈరోజు ఆడకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ వారు వచ్చే వారం నుండి మేము నమాజ్‌ను అనుమతించము’అని చౌహాన్‌ అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి