News

మా జోలికొస్తే మసే!

609views
  • అమెరికాను హెచ్చరించిన చైనా

  • దీటుగా బదులిచ్చిన జోబైడెన్

  • పరస్పర హెచ్చరికలతో సాగిన వర్చువల్ సమావేశం

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ల మధ్య సమావేశం పరస్పర హెచ్చరికలతో సాగింది. ఇరుదేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన వర్చువల్‌ చర్చలను జిన్‌పింగ్‌ బలప్రదర్శనకు బాగా వాడుకొన్నారు. తైవాన్‌ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికన్లు ప్రోత్సహించడమంటే నిప్పుతో చెలగాటమాడుకొన్నట్టే అని, మసైపోతారని బైడెన్‌ను నేరుగా హెచ్చరించారు.

షీ జిన్‌పింగ్‌ తైవాన్ అంశంపై మాట్లాడుతూ…

“తైవాన్‌ అధికారులు తరచూ అమెరికాను మద్దతు కోరడం.. ఇదే సమయంలో అమెరికాలో కొందరు చైనాను దెబ్బతీయడం కోసం తైవాన్‌ను వాడుకోవాలనుకోవడం వంటి చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటివే. నిప్పుతో ఎవరైతే చెలగాటం ఆడుకుంటారో.. వారు భస్మం కావడం ఖాయం” అన్నారు.
దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు .. బైడెన్‌.. జిన్‌పింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చారు. తాము యథాతథ పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు గానీ, తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలు సృష్టించడానికి వ్యతిరేకమని తెలిపారు. ఇరు దేశాలు సమస్యలను సంయుక్తంగా పరిష్కరించాలని నేతలు ఆంకాంక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి