
480views
న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్టు రష్యా ఉన్నతాధికారులు తెలిపారు. మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేందుకు 2018, అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. 5 క్షిపణుల కొనుగోలు కోసం.. 500 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. ఇప్పటికే గతేడాది 800 మిలియన్ డాలర్లను రష్యాకు చెల్లించింది.





