
493views
బీజాపూర్: ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎమ్జీఎస్వై) పథకం కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్, అటెండర్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్వై కింద సబ్ ఇంజినీర్, అటెండర్గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం మనకేలీ గోరనా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లారు. వారు ఎంతసేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ తెలియలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ఉద్యోగులను అపహరించిన మావోలు అందులో అటెండర్ లక్ష్మణ్ పర్తగిరిని గురువారం సాయంత్రం విడిచిపెట్టారు. ఇంజనీర్ లక్రా వారి చెరలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.