News

పబ్లిక్‌ ప్లేస్‌లో నమాజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు

577views
  • ఆ ప్రదేశంలో పేడ పిడకల ఎండవేత

గురుగ్రామ్‌: గురుగ్రామ్‌ ప్రజలు శుక్రవారం తమ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌ చేయడంపై నిరసన కొనసాగిస్తున్నారు. స్థానికుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ ఆపడానికి పోలీసులు నిరాకరించడంతో, కొంతమంది కార్యకర్తలు గురుగ్రామ్‌ సెక్టార్‌ 12ఎ వద్ద నేలపై ఆవు పిడకలను ఎండ‌వేశారు. దీంతో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేయలేదు.

హిందూ సంఘాల సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ వాలీబాల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ‘ఈ ప్రాంతాల్లో బహిరంగ ప్రార్థనలను అనుమతించము… మేము ఇక్కడ వాలీబాల్‌ కోర్టు కోసం ప్లాన్‌ చేస్తాము’అని ప్రమీలా చాహర్‌ అనే కార్యకర్త చెప్పారు. వీర్‌ యాదవ్‌ అనే మరో కార్యకర్త మాట్లాడుతూ నెట్‌ ఏర్పాటు చేసి.. వాలీబాల్‌ కోర్ట్‌ నిర్మిస్తే పిల్లలు ఆడుకుంటారు. ఏది ఏమైనా నమాజ్‌ని అనుమతించమని తెలిపారు.

అదే ప్రాంతంలో హిందూ కార్యకర్తలు గత వారం పూజను నిర్వహించారు. ముస్లింలు నమాజ్‌ చేయడానికి ఉపయోగించే నేలను ఆవు పేడతో కప్పి ఉంచారు. ఆ తర్వాత వాటిని తొలగించలేదు. దీంతో ఈ శుక్రవారం ప్రార్థనలు చేయలేకపోయారు. ‘మన హిందూ సోదరులతో ఒప్పందం కుదుర్చుకునే వరకు, మేము ఇక్కడ ప్రార్థనలు చేయబోమని అందరికీ చెప్పాము. పోలీసులు ఒక వారం సమయం కూడా ఇచ్చారు’ అని ముస్లిం సంస్థలు తెలిపాయి.

సెక్టార్‌ 12ఎ వద్ద ఉన్న ప్రదేశం గురుగ్రామ్‌లోని ముస్లింలు నమాజ్‌ కోసం నియమించబడిన సైట్‌లలో ఒకటి. ఇది 2018లో హిందువులతో ఒప్పందం తర్వాత ముస్లింలకు మంజూరు చేయబడిరది. అయితే, గత కొన్ని నెలలుగా, ఆ ప్రాంతాలలో చాలా మంది నివాసితులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆ నమాజ్‌ సైట్‌లలో హిందూ సమూహాల నిరసనలు ఒక సాధారణ వ్యవహారంగా మారాయి. ఎటువంటి ఘర్షణ జరగకుండా, ముస్లింలు తమ ప్రార్థనలు చేసేలా చూసేందుకు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.

స్థానికుల నుంచి అభ్యంతరాలుంటే నమాజ్‌కు మంజూరు చేసిన అనుమతిని రద్దు చేస్తామని గురుగ్రామ్‌ అధికారులు ముస్లింలకు చెప్పారని మీడియాలో నివేదికలు కూడా వచ్చాయి. గతం అనుమతులు ఇచ్చిన వాటిలో ఎనిమిది ప్రదేశాలలో నమాజ్‌ చేయడానికి గత వారం అనుమతులు రద్దు చేయబడ్డాయి. ‘ఏదైనా బహిరంగ, ప్రదేశంలో నమాజ్‌ చేయడానికి అధికారుల అనుమతి అవసరం. ఇతర చోట్ల కూడా స్థానికులకు అభ్యంతరాలుంటే అనుమతి ఇవ్వరు’ అని అధికారులు చెప్పారు. శుక్రవారం నమాజ్‌ కోసం ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించడంపై అధికారులు తలమునకలైవున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి