
602views
-
ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా
న్యూఢిల్లీ: యోగాపై అవగాహన మరింత విస్తృతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరగనున్నట్టు జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య వెల్లడించింది. యోగాను క్రీడగా ఇటీవల గుర్తించిన కేంద్రం.. ఈ ఏడాది నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో యోగాకు స్థానం కల్పించింది. మహిళలు, పురుషుల విభాగాల్లో చాలామంది అభ్యర్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.





