News

జమ్మూకాశ్మీర్‌లో కొత్త ప్రత్యేక దర్యాప్తు సంస్థ

415views
  • ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా మరో నిర్ణయం

జమ్మూ: స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎస్‌ఐఏ) పేరుతో కొత్త ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు జమ్మూ కాశ్మీర్‌ పరిపాలన ఆమోదం తెలిపింది. ఎస్‌ఐఏ ప్రధానంగా ఉగ్రవాదం, సంబంధిత నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తుంది. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ), ఇతర కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడానికి, తీవ్రవాద సంబంధిత కేసులపై త్వరిత, సమర్థవంతమైన దర్యాప్తును నిర్వహించడానికి ఎస్‌ఐఏ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతంలో పనిచేస్తున్న సీఐడీ, అనుబంధ ఏజెన్సీల నుంచి విడిగా ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు. సీఐడీ వింగ్‌ చీఫ్‌ ఎక్స్‌-అఫీషియో డైరెక్టర్‌గా జే అండ్‌ కే ఎస్‌ఐఏ డైరెక్టరేట్‌ ఏర్పాటు చేయబడుతుంది. ప్రభుత్వం డైరెక్టరేట్‌లో అధికారులను డిప్యూట్‌ చేస్తుంది.

పోలీసు స్టేషన్‌ల ఇన్‌చార్జ్‌ అధికారులందరూ ఉగ్రవాద సంబంధిత కేసుల నమోదుపై, దర్యాప్తు సమయంలో ఏదైనా ఉగ్రవాద సంబంధంతో బయటపడిన కేసుల ఉంటే, వెంటనే ఎస్‌ఐఏకి తెలపాలి. చట్టవిరుద్ధ కార్యకలాపాల(నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, సార్క్‌ కన్వెన్షన్‌(ఉగ్రవాదాన్ని అణచివేయడం) చట్టం, సామూహిక విధ్వంసానికి చెందిన ఆయుధాలు, వాటి పంపిణీతో సహా ఐపీసీ చర్యలు, నిబంధనలకు సంబంధించిన నేరాలు ఏజెన్సీ పరిధిలోకి వస్తాయి. ఉగ్రవాదానికి సంబంధించిన నేరాలు, తీవ్రవాద ఫైనాన్సింగ్‌, అధిక నాణ్యత గల నకిలీ ఇండియా కరెన్సీ నోట్ల చెలామణితో సహా అన్ని ఉగ్రవాద చర్యలు ఎస్‌ఐఏ పరిధిలోకి వస్తాయి. ఉగ్రవాదానికి సంబంధించిన పెద్ద కుట్ర కేసులు, ఉగ్రవాదానికి సంబంధించిన ప్రచారం, తప్పుడు కథనం, పెద్ద ఎత్తున రెచ్చగొట్టడం, అసంతృప్తి వ్యాప్తి, భారత యూనియన్‌పై శత్రుత్వం వంటి కేసులు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

ఎన్‌ఐఏ దర్యాప్తు చేయని సందర్భాల్లో, ‘నేరం ప్రభావం, దర్యాప్తు పురోగతి, ఇతర సంబంధిత అంశాలకు సంబంధించి’ డీజీపీ, జమ్మూ, కాశ్మీర్‌ ఏఐఏతో సంప్రదించి, నిర్ధారిస్తారు. కేసు ఎస్‌ఐఏ పరిశీలిస్తుంది. ఇదిలా ఉండగా, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ యాక్ట్‌, 2008లోని సెక్షన్‌ 7 ప్రకారం యుటీకి బదిలీ చేయబడే కేసులలోని నేరాల  విచారణకు కూడా ఎస్‌ఐఏ ఏజెన్సీగా ఉంటుంది.

Source: The Hindu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి