News

మసీదులకు ‘చైనీస్‌’ హంగులు!

682views
  • అరబ్‌ అకృతులను తొలగిస్తున్న డ్రాగన్‌

బీజింగ్‌: చైనీస్‌ మసీదులు మరింత చైనీస్‌గా కనిపించేలా చేయడానికి, చైనా తన దేశంలోని మసీదుల నుండి అరబ్‌ అకృతులను తొలగించేపనిలో పడిరది. దానికి వారు ‘సైనైజేషన్‌’ అని పేరు పెట్టారు. ఈ ప్రచారం ప్రస్తుతం క్వింగ్‌హై ప్రావిన్స్‌ రాజధాని జినింగ్‌లో ఊపందుకుంది. జినింగ్‌ జనాభాలో 16 శాతం హుయ్‌ ముస్లింలు ఉన్నారు. చైనాచే గుర్తించబడిన 55 జాతి సమూహాలలో, హుయ్‌ ముస్లింలు 10.5 మిలియన్లతో మూడో అతిపెద్ద జాతి సమూహం, అతిపెద్ద ముస్లిం సమాజంగా ఉన్నది.

ఉయ్ఘర్‌ ముస్లింల మాదిరిగా కాకుండా, హుయ్‌ ముస్లింలు హింసకు గురికారు. ఎందుకంటే వారి ఇస్లాం సంస్కరణ చైనీస్‌ భావనలు, సూత్రాలకు అనుకూలంగా ఉంటుంది. హుయ్‌ ముస్లింలు ఇస్లాం చైనీస్‌గా తయారయ్యారు. విదేశీ ప్రభావంతో కాకుండా, ఆ సంఘం చైనీస్‌లాగా కనిపించడానికి, జీవించడానికి ప్రయత్నిస్తుంది.

కమ్యూనిస్ట్‌ పార్టీ నిబంధనలకు అంగీకరించిన తర్వాత కూడా, బీజింగ్‌ నుంచి ఇస్లామిక్‌పై ఒత్తిడి లేకపోలేదు. ఇస్లామిక్‌ గుర్తింపును సూచించే వాటిని లక్ష్యంగా చేసుకుంటోంది. 14వ శతాబ్దపు మసీదు పూర్తిగా పునర్నిర్మాణానికి గురైంది. రెండు పొడవైన మినార్లతో కూడిన గోపురం తొలగించారు. దీంతో అది ఇప్పుడు మసీదు కంటే కమ్యూనిస్ట్‌ కార్యాలయంలా కనిపిస్తోంది.

మరొక మసీదు గోపురాలు, మినార్లు, అరబిక్‌ కాలిగ్రఫీని చైనీస్‌ టెక్స్ట్‌, ఆర్కిటెక్చర్‌తో నిండిపోయింది. దేశంలో అత్యంత సైనికీకరించబడిన ప్రాంతం జిన్‌జియాంగ్‌. ఇప్పుదడి ‘సైనిసైజేషన్‌’ బాధిత ప్రాంతంగా మారిపోయింది. 43 యూఎన్‌ సభ్య దేశాలు జిన్‌జియాంగ్‌పై చైనాకు పిలుపునిస్తూ ఒక ప్రకటనను విడుదల చేయగా, చైనా అన్ని ఆరోపణలను ఖండిరచింది. అంతేకాకుండా, దానిని రాజకీయం చేస్తున్నాయని పశ్చిమ దేశాలను నిందించింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి