News

బంగ్లా ఘ‌ట‌న‌ల‌పై భార‌త్‌లో ఆగ్ర‌హ‌జ్వాల‌!

549views

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువుల‌పై ముస్లిం మూక‌లు దాడులకు పాల్ప‌డుతుండ‌డంతో ఆ దేశ ప్ర‌భుత్వం, ఐక్య‌రాజ్య‌స‌మితి అక్క‌డి హిందూ స‌మాజాన్ని ర‌క్షించాల‌ని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ప‌రిష‌త్ బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిపింది. అల్ల‌ర్ల‌కు కార‌కులైన దోషుల‌పై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

బంగ్లాదేశ్‌లోని హిందూ స‌మాజంపై మార‌ణ‌కాండ కొన‌సాగుతుండ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందూ స‌మాజం గాయ‌ప‌డింద‌ని ఆగ్ర‌హ‌జ్వాల వ్య‌క్తం చేసింది. దేశంలో మూడు వేల చోట్ల ప్ల‌కార్డుల‌తో విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు హిందువులు ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిపారు. బంగ్లాదేశ్‌లోని అకృత్యాల‌పై భార‌త రాష్ట్ర‌ప‌తికి ఒక మెమోరాండం స‌మ‌ర్పించారు.

Source: @VHPDigital

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి