News

మంగ‌ళూరులో దేవాల‌యంపై దాడి!

658views

మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో దుండగులు దేవాలయంపై దాడికి పాల్ప‌డ్డారు. నంది, నాగ విగ్రహాలను ప‌గ‌లుగొట్టారు. దీంతో అక్క‌డి హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న శనివారం (అక్టోబర్ 16) జ‌రిగింది. బైకంపాడి కర్కెరా మూలస్థాన జరందయ్య దైవస్థానం, నాగ బ్రహ్మ పీఠాలపై దాడులకు పాల్ప‌డ్డారు. భక్తులు ఎప్ప‌టిలాగే ఆలయంలో పూజ‌లు చేయడానికి వెళ్లినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నిందితుడు నాగ విగ్రహాన్ని, నంది రాతి విగ్ర‌హాన్ని ధ్వంసం చేశాడు. అంతే కాకుండా, అల్మారా పగలగొట్టి, వస్తువులన్నీ విసిరివేశారు. అదే సమయంలో, ఆలయ ద్వారాలు కూడా దెబ్బ‌తిన్నాయి. భక్తులు ఆలయ నిర్వాహక కమిటీని అప్రమత్తం చేయ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. స్థానికులు మతపరమైన ప్రదేశానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి