News

ఉగ్రవాదులను కీర్తిస్తున్న పాక్‌ ప్రధాని!

398views
  • ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై విరుచుకుపడిన భారత్‌

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌ వైఖరిపై హిందుస్థాన్‌ మరోసారి విరుచుకుప‌డింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లాడెన్‌ వంటి ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించారని భారతదేశం ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సూత్రాలను పరిగణనలోకి తీసుకోకుండా, పాకిస్తాన్‌ తన పొరుగువారిపై పదేపదే సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతోందని పేర్కొంది.

సోమవారం జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 76వ సెషన్‌లో, భారత శాశ్వత మిషన్‌ కౌన్సిలర్‌ ఎ.అమర్‌నాథ్‌ ఇలా అన్నారు… ‘పాకిస్తాన్‌ శాశ్వత ప్రతినిధి ఇక్కడ శాంతి, భద్రత గురించి మాట్లాడుతారు…. ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ‘ఒసామా బిన్‌ లాడెన్‌ వంటి ప్రపంచ తీవ్రవాదులను అమరవీరులుగా కీర్తించారు’. ‘పాకిస్తాన్‌ జమ్మూ-కశ్మీర్‌, లడఖ్‌తో సహా భారతదేశానికి వ్యతిరేకంగా అనేక ఆధారాలు లేని ఆరోపణలు చేసింది. భారతదేశ అంతర్గత విషయాలకు సంబంధించి ఇవి ప్రతిస్పందనను పొందవు’’ అని ఆయన అన్నారు.

‘జమ్మూ-కశ్మీర్‌ మొత్తం భూభాగం భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగం అని నేను ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నాను. ఇందులో పాకిస్తాన్‌ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతం కూడా ఉంది’’ అని ఆయన అన్నారు. భారత దౌత్యవేత్త పాకిస్తాన్‌ తన అక్రమ ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను ‘‘వెంటనే ఖాళీ చేయమని’’ పిలుపునిచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి