
కర్నూలు: కర్నూలు జిల్లాలో శ్రీ శ్రీబ్రహ్మం నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడిరది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వుంటుంది.
ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధ్రువీకరించారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయానికి సమీపంలో గనుల కోసం జరుపుతున్న పేలుళ్ళతో ముప్పు పొంచి ఉంది. నంది విగ్రహం మోపురంపై పగుళ్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే బసవన్న మండపం పైకప్పు దూలం విరిగి కిందకు జారింది. యాగంటి సమీపంలో తవ్వకాలకు అనుమతులివ్వకూడదని కర్నూలు జడ్పీ సమావేశంలో 2017లో తీర్మానం చేశారు.
ఈ కారణంతోనే ఆలయానికి 1.8 కి.మీ దూరంలో ఉన్న ఓ క్వారీ అనుమతులు పునరుద్ధరించలేమంటూ గనులశాఖ ఓ దరఖాస్తును తిరస్కరించింది. అలాంటిది ప్రస్తుతం అక్కడే ఓ సిమెంటు పరిశ్రమకు లైమ్స్టోన్ తవ్వుకోడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆరేళ్ల క్రితం వేంకటేశ్వరస్వామి గుహలో పైభాగం కొంత కుప్పకూలింది. ఈ గుహకు వెళ్లే వంతెన సైతం పగుళ్లకు గురవుతోంది. వీటిపై ప్రభుత్వం దృష్టిపెట్టక పోవడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





