News

అత్యాచారం కేసు మాఫీకి లంచం… నలుగురిపై ఇడి కేసు!

621views

త్రిసూర్‌: అత్యాచారం కేసు మాఫీ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న నలుగురు పోలీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) కేసు నమోదు చేసింది. పోలీసులపై ఈడీ కేసు నమోదు చేయడం కేరళ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. అరుణ్‌ గోపాలకృష్ణన్‌, కొడకర స్టేషన్‌(ఎస్‌హెచ్‌వో), సురేష్‌ కుమార్‌, తడియత్తపరంబు సేషన్‌(ఎస్‌హెచ్‌వో), యాకూబ్‌(ఎఎస్‌ఐ), మహిళా సీపీవో జ్యోతి జార్జ్‌పై కేసు నమోదు చేశారు.

తన కుమారుడిపై ఉన్న అత్యాచారం కేసును మాఫీ చేయడానికి పోలీసులు పరమడ యజమాని నుండి డబ్బు తీసుకున్నారని ఆరోపిస్తూ అజిత్‌ కొడకర అనే ప్రజా కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ తర్వాత ఇద్దరు పోలీస్‌ స్టేషన్‌ చీఫ్‌లతో సహా నలుగురిపై కేసు నమోదైంది. బాధ్యతగల పోలీసులు దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు, డబ్బును దోచుకోవడానికి కేసు మాఫీ చేయడానికి యత్నించారు. దీంతో వారు దోషులుగా తేలింది.

సెప్టెంబర్‌ 30, 2020న తడియత్తపరంబు పోలీసులు జారీ చేసిన అఫిడవిట్‌లో బాలికపై కొడకర స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు ఉంది. అయితే, కొడకర పోలీసులు అక్టోబర్‌ 20న బాలికపై కేసు నమోదు చేశారు. ఇలా వేర్వేరు చోట్ల వేర్వేరుగా కేసు నమోదు చేయడం ద్వారా అమ్మాయిని ట్రాప్‌ చేయడానికి
కొడకర, తడియత్తపరంబిలోని పోలీసులు కుట్ర పన్నారని, దీని కోసం పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు.

Source: Janmabhumi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి