
707views
విశాఖ : ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతాడని ప్రసిద్ధికెక్కిన సింహాద్రి అప్పన్న ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు దక్కింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పరిసరాల పచ్చదనం తదితర అంశాల విషయంలో ఈ విశిష్ట గుర్తింపు నిచ్చారు. కేంద్ర ప్రసాదం కింద సింహాచల క్షేత్రానికి రూ. 53 కోట్లు కేటాయించారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఆలయ ఈవో సూర్యకళ పేర్కొన్నారు.
Source: Vaartha





