
788views
భారత కుస్తీ టీంకు అండగా నిలవాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్ వరకు భారత రెజ్లింగ్ కు U.P ప్రభుత్వం స్పాన్సరర్ గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్ ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది. 2032 వరకు మౌలిక వసతులు, రెజ్లర్ల శిక్షణ కోసం సుమారు రూ.170 కోట్లు ఖర్చు పెట్టనుంది.





