News

U.P : చేసింది తప్పుడు పని. మతం కార్డు వాడి రక్షణ లేదంటూ గగ్గోలు పెడుతున్న ఉర్దూ కవి – మీడియా తప్పుడు వ్రాతలు

836views

తంలో మహర్షి వాల్మీకిని తాలిబన్ ఉగ్రవాదులతో పోల్చి మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాడనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్ గంజ్ కొత్వాలీ పోలీసులు ఉర్దూ కవి మునవ్వర్ రాణాపై కేసు నమోదు చేశారు. ఆయన కుమారుడు తబ్రేజ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిలోయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నాడు. దీని కోసం మీడియాలో ప్రచారం పొందడానికి తనపై కాల్పులు జరిపారని ఆరోపిస్తూ ప్రణాళిక రూపొందించాడు. ఆ మేరకు తనపై ఎవరో కాల్పులు జరిపారంటూ రచ్చ చేశాడు. కానీ సీసీటీవీ ఫుటేజీలో తబ్రేజ్ కాల్పులు నకిలీవని తేలిపోయింది. దాంతో తబ్రేజ్ రాణాను రాయబరేలీ పోలీసులు అరెస్టు చేశారు.

జరిగింది ఇదయితే తబ్రేజ్ తండ్రి మునవ్వర్ రాణా మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నాడు. కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చుకుని ఉత్తరప్రదేశ్ లో ముస్లిమ్ కావడమే అతిపెద్ద నేరమని, దురదృష్ణ వశాత్తు తాను కూడా ముస్లిమునేనని పేర్కొంటూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలకు తెగబడ్డాడు. యూపీ పోలీసులకు ధైర్యం ఉంటే తనను కూడా ఎన్‌కౌంటర్ చేయాలంటూ మునవ్వర్ పోలీసులకు, ప్రభుత్వానికి సవాలు కూడా విసురుతున్నాడు. అసలు విషయం ప్రక్కనబెట్టి కొన్ని పత్రికలు మునవ్వర్ వ్యాఖ్యలను పతాక శీర్షికలకెక్కించి “ఉత్తరప్రదేశ్ లో ముస్లిమ్ కావడమే అతిపెద్ద నేరం” అంటూ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి వార్తలు వ్రాయడం ఆ పత్రికల దిగజారుడుతనానికి నిదర్శనం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.