News

తాలిబన్ల నుండి రక్షించమని మోడీ, షాలకు వేడుకోలు – భారత్ కు వచ్చాక తాలిబన్లపై ప్రశంసలు – ఓ బెంగాల్ కమ్మ్యూనిస్టు తీరు

2.6kviews

34 ఏళ్ల తమల్ భట్టాచార్య, పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ డమ్ డమ్ ప్రాంతంలోని నిమ్టా నివాసి, వృత్తిరీత్యా ఇంజనీర్ మరియు ఈ సంవత్సరం మార్చిలో కర్దన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫిజిక్స్ బోధించడానికి కాబూల్‌కు వెళ్లాడు.
ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తనను తాలిబన్ల నుంచి రక్షించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షాలను శుక్రవారం (ఆగస్టు 20) నాడు ఓ వీడియో సందేశం ద్వారా అభ్యర్థించారు.
అంతకముందు హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి అతను విఫల యత్నం చేశాడు. దాంతో అతను తను పని చేస్తూ ఉండిన పాఠశాల కాంపౌండ్ లోనీ దాక్కున్నాడు. అనంతరం తాలిబాన్ల చేతిలో హత్యకు గురికాకుండా తప్పించుకునేందుకు శుక్రవారం రాత్రి ఓ పెళ్లి మండపంలో ఆశ్రయం పొందాడు.

శనివారం (ఆగస్టు 21) సాయంత్రం, భారత అధికారుల బృందం అతడిని రక్షించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆదివారం (ఆగస్టు 22) నాడు ఢిల్లీకి చేరుకున్నాడు. అదే రోజు మరో విమానంలో కోల్‌కతా చేరుకున్నాడు.

ఆ వెంటనే తాలిబాన్ ఉగ్రవాదులు తనను చాలా బాగా చూసుకున్నారని, తనతో స్నేహ పూర్వకంగా మెలిగారని, తనతో కలిసి ఫుట్‌బాల్ ఆడారని చెబుతూ వారిని ప్రశంసించాడు.

“చిత్రం 1: కాబూల్‌లో చిక్కుకున్న తనను రక్షించమని కోరుతూ ఒక వ్యక్తి విరామం లేకుండా మెసేజులు, ఫోన్లు చేస్తున్న, తనను తరలించడానికి ఏర్పాట్లు చేయాలని ప్రధానిని కోరుతున్న దృశ్యం. చిత్రం 2: ఒకసారి కోల్‌కతాలో అడుగుపెట్టిన తర్వాత, తాలిబన్‌లను ప్రశంసిస్తున్న దృశ్యం. వారు తనతో “ఫుట్‌బాల్” ఆడినట్లు చెప్తున్న దృశ్యం. అతను ఒక కమ్యూనిస్ట్ యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడించాడు.” అని పశ్చిమ బెంగాల్ బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కెయా ఘోష్ ఈ రెండు వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

తాలిబాన్లు ఆదివారం (ఆగస్టు 15) నాడు కాబూల్ ‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాలిబన్లు వారి సహజ శైలిలోఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో భీభత్సాన్ని సృష్టిస్తున్నారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.