News

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు హతం

465views

గస్టు 24, మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఘటనా స్థలం నుండి అనేక ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

సుక్మా S.P సునీల్ శర్మ ANI తో మాట్లాడుతూ, “సుక్మా జిల్లాలోని గోంపాడ్ అటవీ ప్రాంతాల్లో నక్సల్స్ మరియు భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది.”

“ఇద్దరు నక్సల్స్ మృతదేహాలను, ఆయుధాలు/మందుగుండు సామగ్రి/పేలుడు పదార్థాలు మరియు నక్సల్స్ యొక్క ఇతర సామగ్రితో కలిపి స్వాధీనం చేసుకున్నాం. అక్కడి నుండి పారిపోయిన మరో ఇతర నక్సల్స్ కోసం వెతుకులాట కొనసాగుతోంది” అని ఆయన చెప్పారు.

మరణించిన వారిలో ఒకరు కొంటా ఏరియా కమాండర్ (ACM ర్యాంక్) కవాసి హంగా అని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.