
711views
గుజరాత్లోని చారిత్రక సోమనాథ్ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొనున్నారు. సోమనాథ్ ఆలయం వెనుక సముద్ర తీరంలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కిలోమీటర్ పొడవైన ‘సముద్ర దర్శనం’ నడక మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మించిన ఓ మ్యూజియాన్నీ ప్రారంభిస్తారని వెల్లడించారు.





