News

రాళ్లు రువ్వినా, విద్రోహ కార్యక్రమాల్లో పాల్గొన్నా… ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. జమ్ము పోలీసుల కీలక నిర్ణయం

728views

రాళ్లు రువ్వినా, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాలని జమ్మూ-కశ్మీర్‌ పోలీసు విభాగం ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి వారికి పాస్‌పోర్ట్‌లు కూడా జారీ చేయకూడదని పేర్కొంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాల్లో పాల్గొనే వారు ఇకపై విదేశాలకు వెళ్లే అవకాశమే ఉండదని స్పష్టంచేసింది. ఈ మేరకు సీఐడీ స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఏ వ్యక్తికైనా.. పాస్‌పోర్టు జారీ, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రం పరిశీలించే సమయంలో తప్పని సరిగా ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. రాళ్లు రువ్వడం, దేశ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్నారా? లేదా? అన్న విషయాలపై అధ్యయనం చేయాలని సీఐడీ స్పెషల్‌ బ్రాంచ్‌.. పోలీసు అధికారులకు సూచించింది. సీసీ టీవీల ఫుటేజీలనూ పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌ రికార్డుల్లోనూ దీన్ని ధ్రువీకరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ-కశ్మీర్‌ పోలీసుల నిర్ణయాన్ని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రవీందర్‌ రైనా స్వాగతించారు. ఇది గొప్ప అడుగు అని.. దేశ వ్యతిరేకులకు చెంపపెట్టు లాంటిదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.