News

మేకిన్ ఇండియా : రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాముల రూపకల్పనకు శ్రీకారం – వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్

605views

భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ‘రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)’ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టకుకు ‘పీ -75 ఇండియా’ పేరిట త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌పీ జారీకి కావాల్సిన పనులన్నింటినీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి. జలాంతర్గాముల స్పెసిఫికేషన్లు సహా ఇతర అవసరాలను రక్షణ మంత్రిత్వ శాఖ, భారత నావికాదళం సహా ఇతర బృందాలు కలిసి పూర్తిచేశాయని తెలిపాయి. సముద్ర జలాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.