
533views
ఎన్నికల వేళ పశ్చిమ్బెంగాల్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్పై దాడి జరిగింది. కూచ్బెహర్ వద్ద దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దిలీప్ఘోష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దారుణ స్థితిలో ఉందని దిలీప్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు తమ వాహనాలతో పాటు కొంతమంది కార్యకర్తలపైనా దాడి చేశారని విమర్శించారు.





