News

కేరళలో బిజెపి అభ్యర్థిపై సి పి ఐ ఎం గూండాల దాడి

1.1kviews

కేరళలోని అలప్పుజా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీలో ఉన్న అనూప్ ఆంటోనిపై శుక్రవారం సాయంత్రం సి పి ఐ ఎం గుండాలు దాడి చేశారు. అనూప్ తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ ఉండగా ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. అలప్పుజా నుంచి పోటీలో ఉన్న అనూప్ ఆంటోనీకి భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైన భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శిగా బాధ్యత ఉంది. అలప్పుజా జిల్లాలోని ముల్లక్కల్ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న అనూప్ ఆంటోనిపై ఈ దాడి జరిగింది.

దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఎన్నికలలో పోటీ చేస్తున్న తమ అభ్యర్థికి రక్షణ కల్పించడంలో కేరళ పోలీసులు విఫలమయ్యారని, కేరళలో కమ్యూనిస్టుల చేతులలో కీలుబొమ్మలుగా మారిన పోలీస్ అధికారులు అమాయకులపై కమ్యూనిస్టులు దాడులు చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.