
అస్సాంను తిరుగుబాటు రహిత రాష్ట్రంగా చెయ్యడానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగా, వెయ్యికి పైగా సాయుధ ఉగ్రవాదులు శాంతి ప్రక్రియ ద్వారా జన జీవన స్రవంతిలో చేరారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 1000 మందికి పైగా ఉగ్రవాదులు అస్సాంలోని డిస్పూర్ లో లొంగిపోయారు. ఈ ప్రాంతానికి శాశ్వత శాంతిని కల్పిస్తూ, కరుడుగట్టిన ఉగ్రవాది, తిరుగుబాటు నాయకుడు ఇంగ్తి కథర్ సాంగ్బిజిత్ తో సహా 1040 మంది ఉగ్రవాదులు ఫిబ్రవరి 23 న తమ ఆయుధాలను విడచిపెట్టారు. తిరుగుబాటుదారులు 11203 బుల్లెట్లతో పాటు వివిధ రకాలైన 338 ఆయుధాలను స్వాధీనం చేశారు.
కార్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్ (KPLT), పీపుల్స్ డెమోక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కార్బీ లాంగ్రీ (PDCK), కార్బి లాంగ్రీ ఎన్సి హిల్స్ లిబరేషన్ ఫ్రంట్ (KLNLF), కుకి లిబరేషన్ ఫ్రంట్ (KLF) మరియు యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (కార్బి ఆంగ్లాంగ్ ఆధారిత సాయుధ సంస్థలకు చెందిన (UPLA) శ్రీమంత శంకర్దేవ్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రిత్వ శాఖ ఇంచార్జ్ గా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో లొంగిపోయారు.
ఉగ్రవాదులను జన జీవన్ స్రవంతిలోకి స్వాగతించిన సోనోవాల్, భారత రాజ్యాంగంపై విశ్వాసం నింపే లక్ష్యంతో ఆయుధాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నందుకు వారిని అభినందించారు. కర్బీ ఆంగ్లాంగ్ ఈ ప్రాంతంలోని అత్యంత అందమైన జిల్లాలలో ఒకటి అని వ్యాఖ్యానించిన ఆయన, స్వయం ఆధారిత కర్బీ కొండల ప్రాంతం ద్వారా ఆత్మనీర్భర్ అస్సాంను తయారు చేయడంలో సహకరించాలని లొంగిపోయిన తిరుగుబాటుదారులను కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని ప్రతి ప్రాంతం యొక్క సమాన అభివృద్ధికి చేసిన ప్రయత్నం గురించి ప్రస్తావిస్తూ, అస్సాం శ్రేయస్సు వైపు వేగంగా అడుగులు వేస్తోంది అన్నారు. సోనోవాల్ మాట్లాడుతూ, ఉగ్రవాదులను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడంతోనే ప్రభుత్వం యొక్క బాధ్యత పూర్తయినట్లుగా తాము భావించమని, వారికి గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పించాలని కూడా అనుకుంటున్నామని అన్నారు.
రాష్ట్ర పోలీసులు, ఆర్మీ సిబ్బంది, పారా మిలటరీ దళాలు మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ఏకీకృత కమాండ్ స్ట్రక్చర్ మద్దతుతో కొండల జిల్లాకు శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావడానికి కార్బి ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు తులిరామ్ రోంగ్హాంగ్ చేసిన విశేష కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అసోమ్ సాహిత్య సభ మాజీ అధ్యక్షుడు రోంగ్ బాంగ్ టెరాంగ్ మరియు కర్బీ సాహిత్య సభ & కర్బీ సాంస్కృతిక సమాజం ప్రతినిధులను కూడా సోనోవాల్ ప్రశంసించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా, పోలీసు చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత, సిఎం మీడియా సలహాదారు హృషికేశ్ గోస్వామి, పార్లమెంటు సభ్యుడు హరెన్ సింగ్ బే, అదనపు పోలీసు చీఫ్ (స్పెషల్ బ్రాంచ్) హిరెన్ నాథ్, అదనపు పోలీసు చీఫ్ (లా అండ్ ఆర్డర్) జిపి సింగ్, సీనియర్ భారత సైనికాధికారి ఎస్పి సింగ్ , అనేక మంది కర్బీ గ్రామ పెద్దలు, స్థానిక ప్రముఖులు కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.





