
కేరళలోని అలప్పుజ జిల్లా చెర్తాలాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త నందు అని పిలవబడే నంద కృష్ణ22) ను పాపులర్ ఫ్రంట్(ఎఫ్ డీ ఐ), స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎడీపీఐ) కార్యకర్తలు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి ఏడుగురు ఇస్లామిక్ సంస్థల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయయాత్రలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ కేరళ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు పాపులర్ ప్రంట్, ఎస్డిపిఐ సంస్థలు పిలుపునివ్వడంతో ఈ ప్రాంతంలో వారికి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఘర్షణలు చెలరేగినట్లు పోలీసుల సమాచారం. ఈ నేపథ్యంలో నిన్న ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని నిరసన జరిగింది. ప్రదర్శన తరువాత, పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై మరణాయుధాలతో దాడి చేశారు.
ఈ దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నంద కృష్ణ మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి వి.మురళీధరన్ నందు కృష్ణ ఇంటికి వెళ్లి ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం కార్యకర్తలను కలిశారు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యను నిరసిస్తూ అలప్పుజ జిల్లాలో గురువారం (ఈ రోజు) ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, పలు హిందూ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ గోపకుమార్ తెలిపారు.





