News

కేంద్రం హెచ్చరికలతో దిగి వచ్చిన ట్విట్టర్.. వివాదాస్పద ఖాతాలు తొలగింపు.

493views

“మాది సొంత న్యాయవ్యవస్థ. మేము ఎవ్వరికీ తలొగ్గం. భయపడం.” అన్నట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ట్విట్టర్…. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గట్టి హెచ్చరికలతో దిగి వచ్చింది. నిన్న కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి మాట్లాడుతూ “అరెస్టుల దాకా తెచ్చుకోవద్దు. ఈ దేశంలో పని చెయ్యాలంటే ఇక్కడి చట్టాలను గౌరవించాల్సిందే.” అని తీవ్ర హెచ్చరికలు జారీ చెయ్యడంతో ట్విట్టర్… కేంద్రం రద్దు చేయమన్న వివాదాస్పద ఖాతాలలో 97 శాతం తొలగించింది. ఈ విషయాన్ని ట్విట్టరే స్వయంగా వెల్లడించడం విశేషం.

కేంద్ర ప్రభుత్వం రద్దు చెయ్యమని చెప్పిన 1435 ఖాతాలలో 1398 మంది ఖాతాలను ట్విట్టర్ రద్దు చేసింది. రద్దు చేయబడిన వాటిలో ఖలీస్తాన్‌కు స్పష్టంగా మద్దతుగా ఉన్న 1178 ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వీటితో పాటు 257 ఖాతాల్లో ‘మోడీ జెనోసైడ్’ అనే హ్యాష్‌ట్యాగ్ తో ఉన్న 220 ఖాతాలను కూడా రద్దు చేసింది.

నిన్న కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ అధికారులను నేరుగా పిలిపించి అల్టిమేటం జారీ చేసిన తరువాత ట్విట్టర్ ఈ నిర్ణయాలు తీసుకుంది. నిన్న కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ “ట్విట్టర్ ద్వంద వైఖరిని ఏ మాత్రం సహించేది లేదు. అమెరికాలో క్యాపిటల్ హౌస్ మీద దాడి జరిగితే ట్విట్టర్ పోలీసుల వైపు మొగ్గు చూపింది. అదే ఎర్రకోట మీద దాడి జరిగితే మీరు వేర్పాటువాదుల వైపు మొగ్గు చూపుతోంది. ఈ వైఖరిని ఏ మాత్రం సహించం. మీ కంపెనీ సొంత చట్టలకంటే ఈ దేశ చట్టాలు ముఖ్యం. ఇక్కడ పని చెయ్యాలంటే ఈ దేశ చట్టాలను ఖచ్చితంగా గౌరవించాల్సిందే.” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మరోవైపు జాతీయవాదులు “బ్యాన్ ట్విట్టర్” అని ట్విట్టర్ లో ప్రచారం చేస్తుండడం. కేంద్ర మంత్రులు స్వదేశీ యాప్ “koo” లో ఖాతాలు తెరిచి అక్కడ నుంచే ట్విట్టర్ కి కౌంటర్ ఇస్తుండంతో ట్విట్టర్ భయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్షలాదిమంది ట్విట్టర్ ని వదిలేసి స్వదేశీ “koo” యాప్ ని కోట్ల మంది డౌన్లోడ్ చేసుకోవడంతో ఎక్కడ అసలుకే మోసం వస్తుందనే భయంతో ట్విట్టర్ దారికొచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.