News

మెమ్ చంద్ ను మొహమ్మద్ అనాస్ గా మార్చి….. రాజస్థాన్‌లో దళితుణ్ణి బలవంతంగా మతం మార్చిన షాకింగ్ ఘటన వెలుగులోకి

774views

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఒక దళితుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేసిన షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మెమ్ చంద్ ఒక దళిత యువకుడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిని ముస్లింగా మారాలని బలవంతం చేశారు. వాస్తవానికి, మెమ్ చంద్ భార్య కూడా బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడింది.

కానీ ప్రస్తుతం మెమ్ చంద్ హిందూ మతంలోకి తిరిగి రావాలని కోరుతూ అల్వార్ లోని ఒక కోర్టును ఆశ్రయించాడు. బాధితుడికి సాధ్యమైనంత సహాయం అందించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

టైమ్స్ నౌకు లభించిన వివరాల ప్రకారం, మేమ్ చంద్ రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలోని బరోడా మియో ప్రాంతానికి చెందినవాడు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మారిన తరువాత, మెమ్ చంద్ కు కొత్త పేరు, కొత్త చిరునామా ఇవ్వబడింది.

మహమ్మద్ అనాస్ అనేది మెమ్ చంద్ యొక్క కొత్త పేరు, సుంతీ చేయబడిన తర్వాత, మెమ్ చంద్ నివసించడానికి హర్యానాలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఒక స్థలాన్ని ఇచ్చారు.

తనను ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేసిన వారు తనని జమ్మూ కాశ్మీర్‌కు తీసుకెళ్లి అక్కడ జమాత్‌కు హాజరు పరచారని మెమ్ చంద్ టైమ్స్ నౌతో అన్నారు. వారు తన భార్యను కూడా మతం మార్చమని బలవంతం చేశారని, దాని వెనుక ‘చెడు ఉద్దేశ్యాలు’ ఉన్నాయని మెమ్ చంద్ టైమ్స్ నౌ కు తెలిపారు .

Source : Times Now

https://www.timesnownews.com/india/article/from-mem-chand-to-mohammad-anas-a-shocking-case-of-forced-conversion-of-dalit-man-in-rajasthan-comes-to-light/673805

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.