ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి: జాతీయవాద వార్తా ఛానల్ జనం టీవీకి ఐసిస్ హెచ్చరిక

గ్లోబల్ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ కేరళ జాతీయవాద వార్తా ఛానల్ జనం టివికి తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. ఐసిస్ కేరళ యూనిట్ నియంత్రణలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో, సదరు ఉగ్రవాద సంస్థ జనం టివి యొక్క అన్ని కార్యాలయాలను నాశనం చేస్తామని, జనం టీవీ ఉద్యోగులందరినీ అంతం చేస్తామని బెదిరించింది.
ఈ బెదిరింపు సందేశం నేపథ్యంలో, జనం టీవీ కార్యాలయాలకు గట్టి భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీసు చీఫ్ లోక్నాథ్ బెహ్రా పోలీసు శాఖను ఆదేశించారు.
“ముజాహిదీన్ మెసేజ్ టు జనం టివి” అనే సందేశం జనం టీవీ ఉద్యోగులను ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఇస్లాం మతంలోకి మారమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. లేకపోతే ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి మరియు దేవుని కోపాన్ని మరియు శిక్షను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి” అనే సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉంచారు.
తాజా BARC (బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా) నివేదిక ప్రకారం, జనం టివి, రేటింగ్లో విపరీతమైన పెరుగుదల సాధించింది. ఇది మొదటి ఐదు మలయాళ వార్తా ఛానెళ్లలో ఒకటిగా నిలిచింది. సుదీర్ఘ కాలంగా మీడియా రంగాన్ని వామపక్ష మీడియానే శాసిస్తూ వస్తున్న కేరళలో జనం టివి, పేరుకు తగ్గట్టుగానే కేరళలో ప్రజల – ఆధారిత జర్నలిజాన్ని ప్రోత్సహించడానికి, ప్రజల పక్షాన నిలవటానికి చొరవ చూపుతోంది. అలాగే ప్రజామోదాన్ని కూడా పొందుతోంది.





