News

జాగృతి మేనేజర్ శ్రీ వల్లూరి రామకృష్ణ అస్తమయం

494views

ప్రముఖ రాజకీయ, సామాజిక వార పత్రిక ‘జాగృతి’లో మేనేజర్ గా పనిచేస్తున్న సీనియర్ సంఘ కార్యకర్త శ్రీ వల్లూరి రామకృష్ణ హైదరాబాదులోని 9/ 6/2020 మంగళవారం రాత్రి 11 గంటలకు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం ఉదయం 10 గంటలకు వారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా వారిని కడసారి చూసుకునే భాగ్యానికి నోచుకోకపోవడంతో ఉభయ రాష్ట్రాలలోని కార్యకర్తలు, స్వయంసేవక బంధువులు తీవ్ర ఆవేదన చెందారు.

శ్రీ  రామకృష్ణ గతంలో సంఘప్రచారకులుగా పని చేశారు. ప్రస్తుతం జాగృతి మేనేజర్ గా పని చేస్తున్నారు. జాగృతి కంటే‌ ముందు సాహిత్యనికేతన్ లో చాలా  సంవత్సరాలు మేనేజర్ గా సేవలు అందించారు.

స్వర్గీయ భోగాది దుర్గాప్రసాద్ గారు విజయవాడ విభాగ్ ప్రచారక్ గా పనిచేసిన సమయంలో శ్రీ రామకృష్ణ గారు బాపట్ల శాఖ ముఖ్యశిక్షక్ గా పని చేశారు. తరువాతి కాలంలో వారు సంఘ ప్రచారక్ గా గుంటూరు నగరంలో పని చేశారు. ఎమర్జెన్సీకి కొంత ముందుగా వారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రచారకులుగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో అండర్ గ్రౌండ్లో పనిచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.