News

News

వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న దలైలామా

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా ఈ నెలలో అమెరికా వెళ్లనున్నారు. మోకాలి చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లనున్నట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం తరువాత దలై లామా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ...
News

జై హనుమాన్‌

హనుమజ్జయంతి జిల్లాలో వైభవంగా జరిగింది. రామాలయాలు, ఆంజనేయ స్వామి విగ్రహాల వద్ద పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ప్రీతిపాత్రమైన తమలపాకులు, వివిధ రకాల పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు సింధూరం అందించారు. భక్తులు ఆంజనేయ స్వామి చిత్రంతో...
News

తొలకరి పలకరింపు

రాష్ట్ర రైతాంగాన్ని తొలకరి పలకరించింది. మూడు నెలలుగా ఎండ తీవ్రత, వర్షాభావంతో అల్లాడిన ప్రజలు, రైతులకు ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మే 30న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని అనేక భాగాలు,...
News

దేశాభివృద్ధి కలలు సాకారం చేసుకోవాలి.. మోదీ సుదీర్ఘ లేఖ

దేశాభివృద్ధి కోసం కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో మోదీ సుదీర్ఘ లేఖ రాశారు. దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. దేశ పురోగతి...
News

సైనికుడి కుటుంబానికి సత్కారం

వీర మరణం పొందిన 79వ బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ సైనికుడు ఎం.సుధాకర్‌రావుకు నూజివీడు పట్టణం నెహ్రూపేట సామాజిక భవనంలో సీఆర్పీఎఫ్‌ అధికారుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. 1995 జూన్‌ 02న మణిపూర్‌లో తిరుగుబాటుదారులతో జరిగిన ఎన్‌కౌంటర్లో సైనికుడు సుధాకర్‌రావు వీరమరణం పొందారు. హైదరాబాద్‌ చాంద్రాయణ గుట్ట సీఆర్పీఎఫ్‌ కార్యాలయ ఉన్నతాధికారుల ఆదేశంతో నోడల్‌ అధికారి, ఏఎస్సై మల్లేష్‌ బృందం నూజివీడు వచ్చి అధికారుల సమక్షంలో సుధాకర్‌రావు సతీమణి జయమ్మకు, కుటుంబసభ్యులకు సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ.. తాను మరణిస్తానని తెలిసి కూడా దేశ, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన వీర సైనికుడు సుధాకర్‌రావు అని కొనియడారు. వీర మరణం పొందిన సైనికుల జీవితాలు నేటితరం యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, పోలీసు,...
News

పులొస్తుంది.. వేటాడుతుంది

పులుల సంరక్షణ కేంద్రాల్లో నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఒకటి. విస్తీర్ణంలో ఇది దేశంలోని యాభై మూడింటిలోనే పెద్దది. జిల్లాలో మార్కాపురం అటవీ డివిజన్‌ పరిధిలోని పెద్దదోర్నాల, కొర్రప్రోలు, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, నెక్కంటి, వీపీ సౌత్, మార్కాపురం రేంజ్‌లలో విస్తరించి ఉంది....
News

జై హనుమాన్‌.. శోభాయమానం

నెల్లూరు నగరంలో హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను వాహనాలపై కొలువుదీర్చి.. ద్విచక్ర వాహనాల్లో హనుమాన్‌ భక్త బృందం ర్యాలీగా తరలిరాగా- అడుగడుగునా ప్రజలు దీపాలతో హారతులు ఇచ్చారు. పూలవర్షం కురిపించారు. మంగళ వాయిద్యాలు, జై హనుమాన్, జై...
News

64.2 కోట్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న ఈసీ

మరికొద్ది గంటల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి...
1 1,456 1,457 1,458 1,459 1,460 3,069
Page 1458 of 3069