వీర మరణం పొందిన 79వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ సైనికుడు ఎం.సుధాకర్రావుకు నూజివీడు పట్టణం నెహ్రూపేట సామాజిక భవనంలో సీఆర్పీఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. 1995 జూన్ 02న మణిపూర్లో తిరుగుబాటుదారులతో జరిగిన ఎన్కౌంటర్లో సైనికుడు సుధాకర్రావు వీరమరణం పొందారు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట సీఆర్పీఎఫ్ కార్యాలయ ఉన్నతాధికారుల ఆదేశంతో నోడల్ అధికారి, ఏఎస్సై మల్లేష్ బృందం నూజివీడు వచ్చి అధికారుల సమక్షంలో సుధాకర్రావు సతీమణి జయమ్మకు, కుటుంబసభ్యులకు సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ సీఐ ఎంవీవీఎస్ మూర్తి మాట్లాడుతూ.. తాను మరణిస్తానని తెలిసి కూడా దేశ, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన వీర సైనికుడు సుధాకర్రావు అని కొనియడారు. వీర మరణం పొందిన సైనికుల జీవితాలు నేటితరం యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
315views
You Might Also Like
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?
29
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు....
భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది
43
భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక...
తిరువళ్ళువర్ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షల చిత్రపటంపై రాజకీయ వివాదం
33
తమిళ మహాకవి, జ్ఞానద్రష్ట తిరువళ్ళువర్ ను సనాతన ధర్మ సంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల, విభూతితో అలంకరించిన చిత్రపటాన్ని చెన్నైలోని తమిళనాడు లోక్ భవన్...
‘దురంధర్’తో పడిపోయిన ఇమేజీ.. దాడులకు ప్లాన్ చేస్తున్న డీ-కంపెనీ
39
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ దురంధర్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ను పోలినట్టు ఉన్న బడే సాహెబ్ క్యారెక్టర్ మరణశయ్యపై ఉండటం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. దీంతో...
వాషింగ్టన్లో ‘ఇండియా హెరిటేజ్ సెంటర్’ ఏర్పాటుకు ప్రణాళిక
36
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత దేశ 11 వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఒక శాశ్వత మ్యూజియం కొలువుదీరనుంది. సుమారు...
ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు
43
మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా ఆరెస్సెస్ విజయదశమి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిందంటూ 15 మంది ఆరెస్సెస్...





