News

News

సౌదీ అరేబియాలో బయటపడిన 8000 ఏళ్ల నాటి దేవాలయం

సౌదీ అరేబియా లో 8000 సంవత్సరాల పురాతన ఆలయం తవ్వకాల్లో బయటపడింది. ఆలయ అవశేషాలను అక్కడి పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి ససబంధించిన ఫొటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సౌదీ రాజధాని రియాద్‌కి నైరుతి దిశలో వున్న ఆల్ఫా ప్రాంతంలో 8000 ఏళ్ల నాటి ఆలయ అవశేషాలు బయటపడ్డాయని పురావస్తు శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పురావస్తు శాఖలో ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఈ అవశేషాలు బయటపడటంతో పురాతన నాగరికతలు ఎలా వుండేదో తెలిసి వచ్చింది. అత్యంత మన్నికైన రాతితో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, దీనిని నిర్మించిన సృష్టికర్తల నిర్మాణ నైపుణ్యం అమోఘమని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆలయంతో పాటు బలిపీఠాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా ఈ అవశేషాలు...
News

జపానందస్వామికి రైతుల సన్మానం

అనంతపురం జిల్లాలోని పావగడలో స్థానిక రామకృష్ణ సేవాశ్రమ పీఠాధిపతి జపానందస్వామిని శనివారం రైతు సంఘం ఆధ్వర్యంలో తాలూకాలోని రైతులు శనివారం ఘనంగా సన్మానించారు. గడిచిన మార్చ్‌ నెల నుంచి స్వామి పావగడ ప్రాంతానికి చెందిన రైతుల ఎన్నో వేల పశువులకు గడ్డి పంపిణీ చేసి, రక్షించారని సీనియర్‌ రైతు కెంచగానపల్లి గోవిందప్ప అన్నా. అలాగే స్వామి చళికెర, మొలకలమూరు, గుడిబండ తదితర ప్రాంతాలకు చెందిన ఎన్నో పశువులకు మేత అందంచారన్నారు. ఈ నేపథ్యంలో రైతులు స్వామిజీకి పాదపూజ చేసి సత్కరించారు. స్వామిజీ సేవలు ప్రజలకు మరింత ఉపయోగపడాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సురేష్‌బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో లాయర్‌ భగవంతప్ప, తర్కారి కిష్టప్ప, గంగాధర్‌నాయుడు అనేక మంది రైతులు పాల్గొని స్వామిజిని సన్మానించారు....
News

సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర మరోసారి వాయిదా

బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదాపడింది. శనివారం ఈ ప్రయోగానికి రంగం సిద్ధంకాగా.. చివర్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష...
News

రామసేవకుల శోభాయాత్ర

ఎన్టీఆర్ జిల్లా గంపల గూడెం శ్రీరామ సేవకుల ఆధ్వర్యంలో గంపల గూడెం సీతారామ చంద్రస్వామి ఆలయం నుంచి మేడూరు వీరాంజ నేయస్వామి ఆల యానికి శోభాయాత్ర నిర్వహిం చారు. 200 మంది వరకు భక్తులు జైహనుమాన్, జైశ్రీరామ్ నినాదాలతో 5 కి.మీ. పాదయాత్ర చేశారు. దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.పెనుగొలను సమీప మెట్టగుట్ట గజలక్ష్మీ సమేత శేషాచల శ్రీనివాసస్వామి ఆలయంలో శనివారం అర్చకులు శ్యామ సుందరాచార్యులు ఆధ్వర్యంలో మూలవిరా టకు పంచామృతాభిషేకాలు, విశేషార్చనలు, అలంకరణలు నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు స్వామివారిని దర్శించుకుని పాలపొంగళ్లతో మొక్కులు చెల్లించారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు....
News

ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు గ‌డువు పెంపు

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు గ‌డువు జూలై 6వ తేదీ వ‌ర‌కు పెంచినట్లు టీటీడీ తెలిపింది....
ArticlesNews

గీతావాక్యం

గీత- కురుక్షేత్రం నడుమ, ఒక మహా సంగ్రామం ఆరంభ వేళ జరిగిన తాత్విక చర్చ, కురుక్షేత్రం, యుద్ధం ఇవి మన అంతర్గత సమరానికి ప్రతీకలంటారు. పండితోత్తములు. మనలోని యుద్ధ వాతావరణాన్ని గమనించాలి. మానసిక బలహీనతను ఓడించాలి. ఇందులో పాండవ మధ్యముడు ఆత్మ...
News

విజయవాడలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

సమాజం, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో రామాయణం బోధిస్తే.. రామునికి నమ్మినబంటుగా హనుమంతుడు చూపిన ప్రేమ, అభిమానం, స్వామి భక్తి వంటివి.. అనుసరించాల్సిన మార్గాలుగా భావించాలని శైవపీఠాధి పతి శివస్వామి అన్నారు.హనుమంతుడు ఆదర్శనీయుడు అని కొనియాడారు. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ...
News

మన గుడిలో పూజ.. ఢిల్లీ సంస్థ సేవ

రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన ప్రధాన ఆలయాల్లో నిర్వహించే అన్ని రకాల వర్చువల్‌ పరోక్ష పూజలు, సేవలకు సంబంధించిన టికెట్లను విక్రయించడానికి ఢిల్లీకి చెందిన సంస్థ అనుమతి ఇస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.వాస్తవానికి అన్ని ప్రధాన ఆలయాలకూ సొంత వెబ్‌సైట్లు...
1 1,458 1,459 1,460 1,461 1,462 3,069
Page 1460 of 3069