కశ్మీర్లో హిందువులను ఉగ్రవాదుల నుంచి రక్షించాలి: డచ్ ప్రధాని
జమ్మూకశ్మీర్లోని రియాసీ జిల్లాలో జూన్ 10న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన ఘటనపై నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గీర్ట్ విల్డర్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘భారతదేశమా, హిందువులను చంపేందుకు కశ్మీర్ లోయలోకి పాకిస్తానీ ఉగ్రవాదులను రానీయవద్దు. మీ దేశ ప్రజలను కాపాడుకో’’ అంటూ ఎక్స్లో ట్వీట్ చేసారు. రియాసీ జిల్లాలో పాకిస్తానీ ఉగ్రవాదుల దాడిలో 9మంది ఉత్తరప్రదేశ్కు చెందిన భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో ఉగ్రవాదం గురించి గీర్ట్ విల్డర్స్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో హిందువుల దురవస్థల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల విషయంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వైఖరిని ఆయన సమర్ధించారు. గీర్ట్ విల్డర్స్ ఈ యేడాది మొదట్లో నూపుర్ శర్మతో ఫోన్లో సంభాషించారు. ఆమెను భారతదేశానికే కాక మొత్తం...






