News

News

వనదుర్గమ్మ విగ్రహం ధ్వంసం?

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేఘవరం పంచాయతీ జక్కరపేట జంక్షన్‌ సమీ పంలో వనదుర్గమ్మ తల్లి విగ్రహా న్ని ఎవరో గుర్తుతెలియనివారు ధ్వంసం చేశారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలా జరిగిందన్న అంశంపై ఆరాతీస్తున్నారు. గిరిజనులు, గ్రానైట్‌ క్వారీల కార్మికులు ఎంతో పవిత్రంగా పూజించిన వనదుర్గమ్మ విగ్రహం ధ్వంసం కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కాగా ఈ విషయపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ పి.పైడయ్య స్పష్టం చేశారు....
News

యువత ఆలయాలబాట పట్టడానికి.. ఇస్రో ఛైర్మన్ ఆసక్తికర సలహా

నానాటికీ ఆలయాలకు(Temples) వచ్చే యువత సంఖ్య తగ్గిపోతోందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరువనంతపురంలోని శ్రీ ఉదియనూర్ దేవీ ఆలయంలో ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నయ్యర్ చేతుల మీదుగా ఆయన శనివారం ఓ అవార్డు అందుకున్నారు....
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు...
News

తిరుమల ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుమల ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు కోటాను శనివారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. * తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల. *...
News

శ్రీపద్మావతి పరిణయోత్సవాలు

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శనివారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి.శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా రెండవరోజు నిర్వహించారు. ఆ తరువాత ఆస్థానం జరిగింది. అనంతరం వెంకటేశ్వర స్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారంతో పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి....
News

నిజచరిత్ర చెప్పాలి

హిందూదేశం ఎల్లపుడూ ఏదో ఒక విదేశీ పాలనలో ఉండేది, దాని చరిత్ర నిరంతర పరాభవాల గాధ అంటూ అబద్దాలతోను, అవమానాల తోను కూడిన దుర్మార్గ ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారం కేవలం విదేశీయుల చేతనే గాక స్వజనుల చేత కూడా అడ్డూఅదుపూ...
News

సింహాచలం కొండకు వచ్చే భక్తులకు ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు

ఉత్తరాంధ్రలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం విశాఖలోని సింహాచలం కొండకు వచ్చే భక్తులకు ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కృష్ణాపురం గోశాలలో ప్రత్యేక పూజల అనంతరం అలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు బస్ ను ప్రారంభించారు. అదే బస్సులో దేవస్ధానం...
News

తుది దశకు MK1A ఫైటర్ జెట్‌ ట్రయల్స్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, తన మొదటి యుద్ధ విమానం తేజస్ (LCA తేజస్ MK1A)ని జూలైలో భారత వైమానిక దళానికి అందజేసేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేపట్టింది. జూలై నాటికి అన్ని ట్రయల్స్ పూర్తి చేసి వైమానిక దళానికి అందజేయాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ భావిస్తోంది. ఈ యుద్ధవిమానం తేజస్ ఎంకే-1 తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు. 43.4 అడుగుల పొడవు, . 14.5 అడుగుల ఎత్తు కల్గిన ఈ ఫైటర్ జెట్ గరిష్టంగా గంటకు 2,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. పోరాట పరిధి 739 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించేలా రూపొందించారు....
News

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం

వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్స వాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మం గారు) క్రీ.శ.1693 శ్రీముఖ నామ వైశాఖ శుద్ధ దశమి రోజు సజీవ సమాధి నిష్ట వహించారు....
News

చార్‌ధామ్‌ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్‌ తీయడం నిషేధం

చార్‌ధామ్‌ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్‌ తీయడాన్ని నిషేధించారు . ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. పలువురు భక్తుల కోరిక మేరకే ఈ నిర్ణయాన్ని తీసఱకున్నామని, ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధo వుంటుందని...
1 1,214 1,215 1,216 1,217 1,218 2,480
Page 1216 of 2480